ఏలూరు యువతకి కేంద్రంలో కీలక పదవి
ఏలూరు వసంత మహల్ పట్టణానికి చెందిన రేలంగి సుధారాణిని పీఎం మోదీ కేంద్ర సమాచార కమిషనర్ నియమించారు. సోమవారం ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వసంత మహల్ సెంటర్లో నివాసముంటూ సెయింట్ థెరిసా కళాశాలలో డిగ్రీ వరకు విద్యను అభ్యసించారు. అనంతరం లండన్లో చదువు కొనసాగించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయవాదిగా కూడా పనిచేశారు.