లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
JGL: ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం దేవాలయానికి మొత్తం రూ. 5,03,153 ఆదాయం వచ్చినట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. టికెట్ల ద్వారా రూ.2,47,424, ప్రసాదాల విక్రయం ద్వారా .1,85,450, అన్నదానం ద్వారా.70,279 సమకూరినట్లు పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.