శ్రీవారికి ఒక్కరోజే రూ.4.39 కోట్ల ఆదాయం

శ్రీవారికి ఒక్కరోజే రూ.4.39 కోట్ల ఆదాయం

TPT: తిరుమల శ్రీవారి దర్శనం కోసం 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతుంది. బుధవారం 76,501 మంది స్వామి వారిని దర్శించుకుని, 29,033 మంది తలనీలాలు సమర్పించారు. బుధవారం ఒక్కరోజే రూ.4.39 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది.