నరసాపురంలో భారీ చోరీ
W.G: నరసాపురం పట్టణంలో సోమవారం భారీ దొంగతనం వెలుగుచూసింది. గంగులకుర్తి శ్రీనివాస్ అనే వ్యక్తి పది రోజుల క్రితం కుటుంబంతో కలిసి షిరిడీ వెళ్లగా, గుర్తు తెలియని దుండగులు ఆయన ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువాలో ఉన్న రూ.2.5లక్షల నగదు, 16 కాసుల బంగారం, 2 కేజీల వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.