శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం

TPT: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీనివాసుని సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 74, 344 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,169 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీనివాసుని హుండీకి రూ 2.50 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ శనివారం వెల్లడించింది.