BREAKING: పాక్ దాడి.. 10 మంది మృతి
ఆఫ్ఘనిస్తాన్పై పాక్ మరోసారి దాడి చేసింది. ఖోస్ట్ ప్రావిన్స్లోని గృహాలపై పాక్ జరిపిన దాడిలో 10 మంది మృతి చెందారు. వీరిలో 9 మంది చిన్నారులు ఉన్నారు. ఆఫ్ఘన్ వాణిజ్య మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీజ్ భారత్ పర్యటన వేళ ఈ దాడి జరగటం గమనార్హం. గతంలోనూ ఆఫ్ఘన్ మంత్రి భారత్లో పర్యటిస్తున్న వేళ కాబుల్పై పాక్ వైమానిక దాడులకు తెగబడింది.