40 తులాల బంగారం చోరీ

40 తులాల బంగారం చోరీ

TG: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో భారీ చోరీ జరిగింది. పూజారి శ్రీనివాస శర్మ ఇంట్లో సుమారు 40 తులాల బంగారు నగలు, రూ.6 లక్షల నగదును దుండగులు చోరీ చేశారు. నవంబర్ 30న కుటుంబ సభ్యులతో కలిసి ఊరెళ్లిన ఆయన.. సోమవారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చే సరికి బీరువా తెరిచి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లో ఉన్న బంగారం, నగదు చోరీకి గురైనట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.