మంత్రాలయంలో 200 గదులకు భూమి పూజ

KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో 200 గదులకు శుక్రవారం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీ భూమి పూజ చేశారు. శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు భక్తుల సంఖ్య రోజురోజుకు అధికమవుతుండటంతో గదుల సమస్యలు అధికంగా ఉంది. దీంతో భక్తుల సౌకర్యార్థం ఈ గదులు నిర్మిస్తున్నట్లు స్వామీజీ తెలిపారు.