రెంజల్ మండల అధికారులతో కలెక్టర్ సమావేశం
NZB: కందకుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం రెంజల్ మండల అధికారులతో కలెక్టర్ ఇలా త్రిపాఠి సమావేశం అయ్యారు. రెంజల్ మండలం పర్యటనలో భాగంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, జనాభా గణన ప్రక్రియల నిర్వహణపై కీలక సూచనలు చేశారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, దేవాదాయ శాఖ అధికారులు కమల, విజయరామారావు, తహసీల్దార్ శ్రవణ్, తదితర శాఖల అధికారులు ఉన్నారు.