'స్కాలర్ షిప్ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి'
KMR: పెండింగ్లో ఉన్న 8900 కోట్ల రూపాయల ఫీజ్ రియంబర్స్మెంట్, స్కాలర్ షిప్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ కామారెడ్డిలో ఏబీవీపీ ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ చౌరస్తా నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు.