పిడుగుపాటుకు మహిళ మృతి

PLD: నరసరావుపేట మండలం పాలపాడు రోడ్డులో పొలం పని చేస్తున్న గట్ల చిన్నమ్మ (55) అనే మహిళ గురువారం పిడుగుపడి దుర్మరణం చెందారు. మృతురాలు భర్త పెద్ద అంకిరెడ్డి భార్య కాగా, వారికి ఒక కుమారుడు ఉన్నారు. ఈ విషాద ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం తెలిసిన నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.