'విశ్వవిద్యాలయాన్ని నందనవనంగా తీర్చిదిద్దడమే లక్ష్యం'
E.G: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయాన్ని నందనవనంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ అన్నారు. మంగళవారం బాటనీ విభాగం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్ వెనుక ఉన్న బొటానికల్ గార్డెన్ పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వీసీ మొక్కలు నాటారు. అరుదైన జాతులు, ఔషధ మొక్కలతో గార్డెన్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు.