సీఎంపీఎఫ్ పెన్షనర్ల కోసం ప్రత్యేక క్యాంపు: జీఎం
BDK: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ 4.0లో భాగంగా సింగరేణి సీఎంపీఎఫ్ పెన్షనర్ల కోసం ప్రత్యేక క్యాంపు నిర్వహిస్తున్నట్లు జీఎం జి.వి. కిరణ్ కుమార్ బుధవారం తెలిపారు. రేపు ఉదయం 10:30 గంటలకు సింగరేణి హెచ్ఆర్డి కాన్ఫరెన్స్ హాల్లో క్యాంప్ జరుగుతుందని తెలిపారు. పెన్షనర్లు ఆధార్, పాస్బుక్తో హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు.