ధరలు గ్యాస్ ఇబ్బందులపై ఆందోళన
NLG: యుద్ధం వల్ల పెరిగిన ధరలు, గ్యాస్ ఇబ్బందులపై సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చిట్యాల మండలం వెలిమినేడులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ వైఖరిని, కేరళ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను విమర్శించారు. అర్హులైన పేదలకు ఇళ్లు, స్థలాలు ఇవ్వాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.