అరటి తోటలో అగ్నిప్రమాదం

అరటి తోటలో అగ్నిప్రమాదం

KDP: లింగాల మండల పరిధిలోని ఇంటి ఓబయ్య పల్లిలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. అరటి తోటలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో రూ.50 వేల విలువైన అరటి పంట దగ్ధమైంది. సమాచారం అందుకున్న వెంటనే పులివెందుల అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వారి సమయస్ఫూర్తితో రూ.3 లక్షల విలువైన మిగిలిన పంటను కాపాడగలిగారు.