జిల్లాకు ఆరెంజ్ అలర్ట్
ప్రకాశం: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రానున్న 3 గంటల్లో పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రకాశం, మర్కాపురం జిల్లాలో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరం అయితే తప్ప బయటకి రావోద్దని అన్నారు.