మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: MLA
SKLM: మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. వజ్రపుకొత్తూరు (M) గుల్లల పాడు నుంచి పలాస వరకు నూతంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సును జెండా ఊపి ఆమె సోమవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగు పడితే మహిళలు, విద్యార్థులు, వృద్ధులకు ఎంతో ఉపశమనంగా ఉంటుందని పేర్కొన్నారు.