'ప్రజలకు చేరువకై ఫుట్ పెట్రోలింగ్'

'ప్రజలకు చేరువకై  ఫుట్ పెట్రోలింగ్'

NZB: ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ కావాలనే ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని ఎస్సై జి.అనిల్ రెడ్డి తెలిపారు. కమ్మర్ పల్లి మండలంలోని ఉపూర్గ్రమంలో గురువారం రాత్రి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. పోలీసులు అందించే సేవలను ప్రజలకు తెలియజేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారి సమాచారాన్ని తమకు అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు.