పామూరులో నేరాల నియంత్రణకు డ్రోన్ గస్తీ

ప్రకాశం జిల్లా పామూరు పట్టణంలో ఆదివారం పోలీసులు డ్రోన్ ఎగరవేసి, అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నేరాల నియంత్రణకు జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. అల్లర్లు, కోడి పందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలను డ్రోన్ల ద్వారా అరికట్టవచ్చని వారు పేర్కొన్నారు.