ఈ నెల 9న జాతీయ అప్రెంటీస్షిప్ మేళా
RR: షాద్నగర్ పట్టణంలోని ప్రభుత్వ ITI కళాశాలలో ఈ నెల 9న జాతీయ అప్రెంటీస్ షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ లక్ష్మణ్ తెలిపారు. ఈ మేళా ద్వారా ITI ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రముఖ కంపెనీల్లో అప్రెంటీస్షిప్ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 9న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే మేళాకు ఆసక్తి కలిగిన ITI పాసైన విద్యార్థులు హాజరుకావాలన్నారు.