ఎయిర్‌పోర్ట్‌పై దాడి.. భయం భయంగా ఉంది: పీవీ సింధు

ఎయిర్‌పోర్ట్‌పై దాడి.. భయం భయంగా ఉంది: పీవీ సింధు

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకుపోయింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణి ఒకటి దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై పడింది. దీంతో విమానాశ్రయం స్వల్పంగా దెబ్బతింది. ఈ ఘటనపై పీవీ సింధు పోస్టు చేసింది. తాము బస చేస్తున్న ప్రాంతానికి సమీపంలో పేలుడు జరిగిందని, దీంతో వెంటనే అక్కడినుంచి పారిపోయామని తెలిపింది. భయానక పరిస్థితులు ఉన్నట్లు పేర్కొంది.