VIDEO: స్టేజ్పై పాట పాడిన ఎనర్జిటిక్ స్టార్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న చిత్రం 'ఆంధ్ర కింగ్ తాలూకా'. తాజాగా జరిగిన ఈ సినిమా మ్యూజిక్ కాన్సర్ట్ ఈవెంట్లో రామ్ సింగర్ అవతారం ఎత్తాడు. స్టేజ్పై ఈ చిత్రంలో తానే స్వయంగా రాసిన 'పడు పడు లేచి నిలబడు' అనే పాటను ఆలపించి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. కాగా, ఈ చిత్రం ఈ నెల 27న బాక్సాఫీస్ ముందుకు రానుంది.