విద్యార్థులకు అలర్ట్.. నేటితో ముగియనున్న గడువు

కృష్ణా: కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో మార్చి 2025లో నిర్వహించిన స్పెషల్ బీఈడీ 1వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. రీ వాల్యుయేషన్/పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు మంగళవారంలోగా ఒక్కో పేపరుకు రూ.900 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని KRU పరీక్షల విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది.