నూతన DCC అధ్యక్షుడుకి శుభాకాంక్షలు తెలిపిన MLA
NZM: ఏఐసీసీ ప్రకటించిన డీసీసీ అధ్యక్షుల నియామకంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన కాటిపల్లి నగేష్ రెడ్డికి ఆదివారం సాయంత్రం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి తన నివాసంలో శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి, కార్యకర్తలకు అండగా ఉండాలని ఈ సందర్భంగా భూపతి రెడ్డి సూచించారు.