అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

KRNL: జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చే అర్జీల్లో 85 శాతం రెవెన్యూకు సంబంధించినవేనని, అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ పి.రంజిత్ బాషా హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశం భవనంలో రెవెన్యూ అంశాలపై సబ్ కలెక్టర్, ఆర్డీవో, సర్వేయర్లతో కలెక్టర్ నిన్న సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే నాలుగైదు సార్లు చెప్పానని, ఇక ఉపేక్షించేది లేదని అన్నారు.