శ్రీసత్యసాయి జిల్లాలో చంద్రబాబు పర్యటన
AP: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపల మండలంలోని పెద్దన్నవారిపల్లిలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:45 గంటలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి లబ్ధిదారులతో కొంతసేపు ముచ్చటించనున్నారు.