ఇతర రాష్ట్రాల్లోనూ ప్రాజెక్టులు: డిప్యూటీ సీఎం
TG: సింగరేణి సంస్థ ద్వారా తొలిసారిగా ఇతర రాష్ట్రాల్లోనూ విద్యుత్తు, గ్రీన్ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు సింగరేణి సంస్థతో కలిసి రాజస్థాన్ రాజ్య విద్యుత్తు ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ 2300 మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.