చెరువులో పడి బాలుడి మృతి

చెరువులో పడి బాలుడి మృతి

మన్యం: భామిని మండలం సతివాడలో పున్ననా తేజ (7) చెరువులో పడి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి చెరువులో చేపలు పట్టే క్రమంలో జారిపడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తేజ తండ్రి రెండేళ్ల క్రితం మృతి చెందగా, ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఇలా చెరువులో పడి చనిపోయాడు. కొడుకు కోసం బతుకుతున్న నాకు దిక్కెవరు ఆ తల్లి బోరున విలపించింది.