ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: ఎమ్మెల్యే

NDL: ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ఆదేశించారు. శుక్రవారం కర్నూలులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.