బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం సాయంత్రం ప్రారంభం అయ్యాయి. బ్రహ్మోత్సవాలకు ఛైర్మన్ పల్లెల రవీందర్ గుప్తా, ఈవో బెల్లంకొండ రంగాచారి ఆధ్వర్యంలో అంకురార్పణ చేశారు. కార్యక్రమంలో ధర్మకర్తలు చందా నాగరాజు, గాలి కిష్టయ్య, నాయకం శ్రీనివాస్, కొత్తపల్లి శ్రీనివాస్, నాచారం సర్పంచ్ సారిక యాదగిరి పాల్గొన్నారు.