నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VSP: విశాఖలోని ఆరిలోవ పరిధిలో శుక్రవారం పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని ఏపీ ఈపీడీసీఎల్ జోన్-3 ఈఈ బీ.సింహాచలం నాయుడు గురువారం తెలిపారు. పైనాపిల్ కాలనీ, ఎస్ఎస్ఎన్ నగర్, శ్రీకృష్ణాపురం, రామకృష్ణాపురం, ఆరిలోవ చివరి బస్స్టాప్, ఎస్కేఎంఎల్ నగర్, పాండురంగాపురం, జైభీమ్ నగర్, శివశంకర్నగర్, దుర్గాబజార్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.