హర్మన్ ప్రీత్, అమన్ జ్యోత్కు.. పీఏసీ రివార్డు
పంజాబ్ క్రికెట్ అసోసియేషన్(పీఏసీ) హర్మన్ ప్రీత్, అమన్ జ్యోత్కు రివార్డు ప్రకటించింది. టీమిండియా మహిళల వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించడంతో వారికి పీఏసీ రూ.11 లక్షల చొప్పున రివార్డు అందజేయనుంది. అలాగే, జట్టు ఫీల్డింగ్ కోచ్ మునీష్ బాలికి రూ.5 లక్షల రివార్డు ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని వారికి త్వరలోనే అందించనున్నట్లు వెల్లడించింది.