ఐకేపీ సెంటర్లో రైతుల నిరసన
SRPT: తుంగతుర్తి మండలం అన్నారం ఐకేపీ సెంటర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఐకేపీ నిర్వహకులు, మిల్లర్లు కుమ్మక్కై ధాన్యంలో 3 కేజీలు కోత విదిస్తున్నారని ఆరోపిస్తూ రైతులు పెట్రోలే బాటిళ్లతో మంగళవారం నిరసన చేపట్టారు. వెంటనే ప్రభుత్వం స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరపాలని వారు డిమాండ్ చేశారు.