క్రీడల ప్రోత్సాహానికే స్పోర్ట్స్ యూనివర్సిటీ: CM
TG: గచ్చిబౌలి స్టేడియంలో ఆల్ ఇండియా పోలీస్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ముగింపు వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఒకప్పుడు HYD ఫుట్బాల్కు కేంద్రంగా ఉండేదని గుర్తుచేశారు. ఇక్కడి నుంచి ఎంతో మంది క్రీడాకారులు దేశానికి ప్రాతినిధ్యం వహించారన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకే రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.