అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే సామేలు

నల్గొండ: గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. శనివారం మూసిపట్ల గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. గ్రామాల్లో అన్ని మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శారద సంతోష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.