లారీ ఢీకొని వ్యక్తి మృతి.. కేసు నమోదు

లారీ ఢీకొని వ్యక్తి మృతి.. కేసు నమోదు

JGL: మెట్పల్లి మున్సిపల్ పరిధి వెంకట్రావుపేటకు చెందిన ఇల్లెందుల సాగర్ (28) తన స్నేహితుడైన శివతో కలిసి మార్కెట్ నుంచి వెల్లుల్లకు బైక్‌పై వెళ్తుండగా పాత బస్టాండ్ వద్ద శనివారం రాత్రి లారీ ఢీ కొట్టిందని ఎస్సై కిరణ్ కుమార్ ఆదివారం తెలిపారు. గాయపడిన సాగర్ మృతి చెందగా.. తీవ్ర గాయాలైన శివను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించినట్లు వెల్లడించారు.