జిల్లాలో ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు బదిలీ

జిల్లాలో ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు బదిలీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో మామూనూర్ ఇన్‌స్పెక్టర్ ఓ.రమేశ్ వీఆర్‌కు బదిలీ కాగా, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ ఈ.శ్రీనివాస్ మామూనూర్‌కు బదిలీ అయ్యారు. వీఆర్‌లో విధులు నిర్వహిస్తున్న ఏ.ప్రవీణ్ ఐటీ కోర్ సెల్‌కు బదిలీ అయ్యారు.