సౌదీ బస్సు ప్రమాద మృతులకు ఘన నివాళులు
E.G: సౌదీ అరేబియా మక్కా (ఉమ్రా) యాత్రికులు బస్సు ప్రమాదంలో మరణించిన 42 మంది మృతుల ఆత్మకు శాంతి కలగాలని రాజమండ్రి రూరల్ వైసీపీ జిల్లా అధ్యక్షుడు వేణు గురువారం నివాళులర్పించారు. మసీదుల నుండి వచ్చిన ఇమామ్లతో దువా చదివించి, మౌనం పాటించారు. వారి పవిత్ర ఆత్మకుశాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధించారు.