స్వామివారి సేవలో మాజీ మంత్రి
CTR: కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానాన్ని కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు.