గ్రూప్-2 కొలువు సాధించిన ఉద్యోగిని సన్మానించిన GM
MNCL: సింగరేణి ఉద్యోగం చేస్తూ పట్టుదలతో గ్రూప్-2 కొలువు సాధించిన ఉద్యోగిని బెల్లంపల్లి ఏరియా GM విజయభాస్కర్ రెడ్డి సన్మానించారు. ఎన్విరాన్మెంట్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సురేష్ రెడ్డి ఉప తహశీల్దార్గా కొలువు సాధించారు. నిరుద్యోగ యువత గోలేటి సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని GM కోరారు.