కోదండ రామస్వామి ఆలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణం
అన్నమయ్య: ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో ఇవాళ సీతారాముల స్వామి వారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. కళ్యాణం చేయించాలనుకునేవారు ఒక్కో టికెట్కు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు టీటీడీ అధికారులు చెప్పారు.