'జగన్ పాలనలో మహిళలకు రక్షణ'
అనంతపురం వైసీపీ కార్యాలయంలో వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి ఆధ్వర్యంలో మహిళా విభాగం ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. వైయస్ జగన్ పాలనలో మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేశారన్నారు.