ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మంత్రి
ADB: జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం అనుకుంట గ్రామంలో పర్యటించారు. లబ్ధిదారులు బాస గంగమ్మ-భర్త రమేశ్కు కేటాయించిన ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించారు. సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికిన గ్రామస్థుల సమక్షంలో, మంత్రి లబ్ధిదారులను పట్టు వస్త్రాలతో సత్కరించారు.