విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
NRPT: ధన్వాడ మండలంలోని పాత పల్లి ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు బోధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాత్రలో భవ్య శ్రీ, డీఈవోగా ఓంకార్, ఎంఈవోగా కౌసల్య, పాఠశాల హెచ్ఎమ్గా ఐశ్వర్య వ్యవహరించినట్లు పాఠశాల హెచ్ఏం శ్రీ లత తెలిపారు. ఉత్తమ విద్యాబోధన ఇచ్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.