ఉయ్యాలవాడలో పంచాయతీలకు ప్రత్యేక అధికారులు
NDL: ఉయ్యాలవాడ మండలంలోని 20 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఎంపీడీవో ఉమామహేశ్వరరావు శనివారం తెలిపారు. సర్పంచుల పదవీకాలం ఈనెల 2తో ముగియడంతో తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఎంపీడీవో, తహసీల్దార్ ప్రసాద్ బాబు, డిప్యూటీ ఎంపీడీవో నాగలక్ష్మమ్మ, పశువైద్యాధికారి సాయిబాబాలను కలెక్టర్ నియమించినట్టు ఆయన వెల్లడించారు.