మేడిగడ్డ బ్యారేజీకి తగ్గిన వరద ఉద్ధృతి
BHPL: జిల్లా మహాదేవపూర్ మండలంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో వరద ప్రవాహం తగ్గుతోంది. గురువారం 3,41,350 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోందని బ్యారేజ్ నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బుధవారం నుంచి గురువారం వరకు 65వేల క్యూసెక్కుల వరద ప్రవాహం తగ్గింది. సుందిళ్ల పార్వతి బ్యారేజ్, ఎల్లంపల్లి, అన్నారం ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కొనసాగుతోంది.