వరి రైతులకు ఏవో సూచనలు

వరి రైతులకు ఏవో సూచనలు

E.G: గోకవరం మండలంలో కురుస్తున్న అకాల వర్షాలతో దాళ్వా వరి పంటకు మాగుడు, మానిపండు తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని మండల వ్యవసాయాధికారి పీ. రాజేశ్వరి హెచ్చరించారు. గింజ పాలు పోసుకునే దశలో ధాన్యం రంగు మారకుండా ఉండాలంటే, నివారణకు ఎకరానికి 200 మి.లీ. ప్రాపిక్రోనజోల్ పిచికారీ చేయాలని ఆమె సూచించారు. రైతులు అప్రమత్తంగా ఉండి పంటను కాపాడుకోవాలని కోరారు.