శుక్రవారం: నేటి తిరుమల సమాచారం
TPT: తిరుమలలో ఇవాళ భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేనివారి దర్శనానికి సుమారు 14 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న మొత్తం 62,642 మంది శ్రీవారిని దర్శించుకోగా 23,887 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.4.18 కోట్లు వచ్చిందని TTD తెలిపింది.