మాస్ కాపీయింగ్పై డీఈవో సీరియస్ యాక్షన్
NZB: జిల్లాలోని ఆలూర్, మండోరా టెన్త్ పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ ఘటనపై డీఈవో సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. ఈ బృందాలు సోమవారం నుంచి పరీక్షలు అయిపోయేంత వరకు కేంద్రాలకు తనిఖీలు నిర్వహించునున్నారు. ఈ సందర్భంగా సీఎస్, డీవో, ఇన్విజిలేటర్లు సెల్ఫోన్లను ఇంటి వద్దే ఉంచి వెళ్లాలని డీఈవో ఆదేశించారు.