'దళితులను వేధిస్తే పతనం ఖాయం'

'దళితులను వేధిస్తే పతనం ఖాయం'

GNTR: తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో బాబూ జగ్జీవన్‌ రామ్ జయంతి నిర్వహించారు. నేతలు వెలంపల్లి, మల్లాది విష్ణు ఆయనకు నివాళులర్పించారు. కూటమి పాలనలో దళితులపై దాడులు, వేధింపులు పెరిగాయని వారు మండిపడ్డారు. ఓ దళితుడిపై స్పీకర్‌ అయ్యన్న దాడి చేయడమే ప్రభుత్వ తీరుకు నిదర్శనమన్నారు. దళితుల కన్నీళ్లకు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని నేతలు హెచ్చరించారు.